పంజరంలో తలుపేసుకుని... భావాలకు ముసుగేసుకుని..

ఊహాల రెక్కలు కోసేసుకుని...మార్పు అనే తూర్పు వైపు చూడకుండా ఎన్నాళ్ళీలా....?

చీకటినే... వెలుగని భ్రమిస్తూ...సుదీర్ఘ సుషుప్తస్ధితి లోనే చైతన్యం ఉందని నమ్మేస్తూ...

బావిలో కప్పలా బ్రతుకేస్తూ.... ఎన్నేళ్ళీలా.... ?

పెనుగాలులు వీచినప్పుడు...మహా వృక్షాలు కూలిపొతాయి...

లేత మొక్కలు మాత్రం క్షేమంగా మిగిలిపొతాయి... ఎందుకో తెలుసా నేస్తం.....

చెట్లు మార్పును ఎదిరించే ప్రయత్నం చేస్తే....

మొక్కలు సవినయంగా తలవంచి స్వాగతిస్తాయి....

మన ఆలోచనలతో నిండిన లక్ష్యాల్నీ పునర్నిర్మించుకున్నప్పుడూ......

అర్హతలతో నిండిన నైపుణ్యాలు అవే బయటకు వస్తాయి....

ఆత్మవిశ్వాసంతో నిండిన గతాన్ని గౌరవిస్తూన్నప్పుడూ.....

వైఫల్యాలతో నిండిన అద్దాల గొడలు వాటికవే బద్దలవుతాయి...

స్వేచ్ఛలో స్వచ్ఛతనీ.... సృజనలో వికాసాన్నీ....

సహజ చలనంలో మార్పు మాధుర్యాన్ని.... చవిచూడలేక....

పాతబడిపొయిన ఆలోచన ధోరణితో....

జీవితాన్ని అనుభవించడంలో ఓడిపోతున్నాం....

గుప్పెడంత గుండె చెప్పే ఊసుల్ని...ఊ...కొట్టలేక...

మౌనం నుండి చైతన్య వాస్తవాలను వెలికితీస్తున్న....

మనసును... జయించడంలో ఓడిపోతున్నాం....!

ప్రశ్నించడం నా తత్వం...ఎందుకంటే .. నేను జిజ్ఞాసిని....

స్వార్ధం లోభం నిండిన లోకం ఆహ్వానిస్తే వచ్చిన అతిథిని....

ఓ సగటు మనిషిని.....!

1 Comment:

  1. వంశీ కృష్ణ said...
    baavundi!

Post a Comment