(వరద బాధితులను దయచేసి మానవతతొ అదుకొండి....మీకు తొచిన సహయం చేయ్యండి.... మీ రేవా....)

ఆకాశాన్ని మేఘం నల్లని కంబళిలా కప్పుకొంది....

ఆనందం మనసులొ మయూరబర్హంలా విప్పుకొంది...

ఆలొచన లెందుకు జవ్వని...!

విలొకించు వర్షా సంధ్యని....!

అని ఒక కవి అన్నట్లుగా....

ప్రకృతి వికహట్టహసం చేస్తే మనిషికిక దిక్కేది...?

కరుణ చూపాల్సిన వరుణుడు ప్రళయ గర్జన చేస్తే వేరే దారేది...?

అన్యాయం విలయమై విరుచుకు పడింది....

మానవ జీవితం కకావికమైనది...

ప్రజల కల చెదిరింది... తీరని వ్యధ మిగిలింది....


ప్రతి ఉదయం భారం తొనే మొదలవుతుంది...

ప్రతి రాత్రి సమస్యల సుడిగుండంతొనే ముగుస్తొంది...

రేపటి మీద వారికిప్పుడు ద్యాసలేదు...

ఈ పూట గడిస్తే చాలన్న ఆశ తప్ప...!

మనం తేరుకొని ఒక్కసారి తేరపార చూస్తే...

నలుదిశల కన్పిస్తున్నది.... ప్రళయ శిధిలాలు...

వినిపిస్తున్నది శిధిల నాధాలు...

జన జీవన స్రవంతికి జీవనాడులైన అనుబంధాలు

అయిన వారికొసం మినుకు మినుకు మనే ఆశతొ....

ఎదురు చూపలు ఆదరవు కొసం అన్వేషణ....

అన్ని కొల్పొయి.... అందర్ని కొల్పొయి....

జీవం ఉన్న జీవచ్చావాలు...అడుగడుగునా స్మశాన వాటికలు....

మానవ ఇతిహసంలొ అనుబంధపు పేగు కదలాలిప్పుడు....

అందుకొసం ఒక్క క్షణం మనసు పెట్టి ఆలొచించండి....


ఆరొజు ఎప్పటిలాగే తెల్లవారిందని అనుకున్నారే కాని...

తమ బ్రతుకులిలా తెల్లారిపొతాయని వారు ఊహించలేదు...

ప్రకృతి ఒడిలొ దగాపడిన జీవితాలు... మన ముందు సాక్షాత్కరిస్తున్నాయి.....

సాటి మనిషికి సాయమందించడమే కధా మానవతా....!

ఆపదలొ అదుకొవడమే కధా సహృదయతా.....!

పట్టెడన్నం వారికిప్పుడు పరమానం.....

చిరిగిన వస్త్రం వారికిప్పుడు పట్టు వస్త్రంతొ సమానం....

మీ హృదయపు కవాటలు తెరిచి....

దాతృత్యపు పార్వర్సాన్ని సృశించండి....


తెల్లవారితే కూడు దక్కదు....

పొద్దు వాలితే గూడు చిక్కదు...

కంటికి మింటికి ఏకధారగా కారే కన్నీటి సంద్రంలొ ఎన్ని ఉప్పెనలొ...!

గాయపడ్ద గుండెల్లొ గూడుకట్టిన ఎన్ని ఫెను తుఫానులొ....!

నిన్న తల్లి ఒడిలొ హయిగా ఆదమరిచి నిద్రపొయిన చంటి వాడు...

నేడు కంటికి కూడ కానరాని దూరతీరాలకు తరలిపొయిన తల్లిని తలంచుకుంటు...

ముంజేతులతొ కన్నులు తుడుచుకుంటూ...

ఏ అరుగు మీదనొ....అనాధలా నిద్రపొయే పరిస్ధితి...

ఆర్ధిస్తొంది దీనంగా... అదుకొండి మనసారా....!


తిలక్ గారు అన్నట్లు.....

ఆ రొజుల్ని తలంచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి

విచారం కూడ కలుగుతుంది....

నేటి హేమంత శిధిల పత్రాల మధ్య నిలిచి....

నాటి వాసంత సమీర ప్రసారాల తలచి...

ఇంతే కధా జీవితం అన్న చింత....

ఇంతలొనే ముగిసిందన్న వంత....

చెమ్మగిల్లిన నాకళ్ళును చెదిరిన నా మనస్సుతొ....

ఇటు తిప్పుకుంటాను... ఎవరైన చూస్తారేమోనని....


"కమ్మరి కొలిమి... కుమ్మరి చక్రం...

జాలరి పగ్గం... సాలెల మగ్గం...

శరీర కష్టం స్పూర్తింపజేసే గొడ్డలి... రంపం... కొడవలి... నాగలి...

సహస్రవృతుల సమస్త చిహ్నలు....

నా వినుతించే... నా విరుతించే... నా వినిపించే...

నా విరిచించే నవీనరీతికి... భావం.. భాగ్యం.. ప్రాణం... ప్రణం...

అని ప్రస్పూటించిన మహకవి వాక్కులు అక్కడ నేడు తెల్లబొయాయి..."


జిల్లాలు ఎల్లలు దాటి... సముద్ర తీరాన చేరి ....

సాగర గర్జనే నమ్ముకుని బ్రతికే వారేందరినొ ఆ సముద్రమే

నిర్దాక్షణ్యంగా కబళించేసింది....

ఇలా ఎందరవొ ఒంటరి బతుకులు...

మరెన్నొ గుండెల్లొ ఆరని చితులు....

బతుకు వారికిప్పుడు సమరం....

కాస్తంత మన సహయమే వారికి కొండంత ఉపకారం....

2 Comments:

  1. priya said...
    andhara lo andhru varadhalalo kottuku pothunte...
    neenu mee kaviatha velluvalo
    kottuku pothunnaaa...
    బుజ్జి said...
    ధ్యాంక్స్ అండీ.... మానవతతొ సాయమందించండి....

Post a Comment